జడ్జిల నియామకంలో ఆలస్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం

-

న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఆలస్యానికి గల కారణమేంటో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కిషన్​ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం. కొలీజియం పేర్లు సిఫార్సు చేసినా హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఆ పేర్లను ఉపసహరించుకునేలా చేసేందుకు ఈ జాప్యం ఓ సాధనంగా మారిందని వ్యాఖ్యానించింది.

బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. న్యాయమూర్తుల నియామకంలో జాప్యానికి గల కారణాలను తాము అర్థం చేసుకోలేకపోతున్నామని, అందుకే నియామకాల్లో జాప్యంపై కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని స్పందించాలని ఆదేశించింది. ఈ పిల్​పై తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news