TSPSC పేపర్ లీక్ లో బయటకు కీలక విషయాలు ?

-

కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఘటన TSPSC పేపర్ లీక్. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయం ఊపిరితీసుకోకుండా చేస్తోంది. ఇక ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ పేపర్ లీక్ లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ లీక్ లో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తున్న ప్రవీణ్… తన కోసమే పేపర్ ను దొంగిలించాడట. అయితే ఆ తర్వాత విషయం ఇంత పెద్దది అవుతుందని ఆలోచించని ప్రవీణ్ మరో ముగ్గురు ఉద్యోగులకు ఈ పేపర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ విధంగా ప్రవీణ్ తో కలుపుకుని మొత్తం 5 మందికి TSPSC గ్రూప్ 1 పేపర్ లభించిందట. ఈ విషయాన్ని మొత్తం గ్రూప్ 1 ను రాసిన 84 మంది అభ్యర్థులను విచారణ చేయడం ద్వారా తెలుసుకున్నట్లు SIT బయటపెట్టింది. అంతే కాకుండా AE పరీక్ష ప్రారంభం కాక ముందే మొత్తం 12 మంది అభ్యర్థుల దగ్గర పేపర్ ఉన్నట్లు SIT బహిర్గతం చేసింది. ఈ పేపర్ లీక్ వలన సంవత్సరాల తరబడి ఈ పరీక్ష కోసం కష్టపడి చదివిన అభ్యర్థులు తీవ్రంగా బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news