ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి ‘చర్మనిధి’

-

మానవ శరీరంలో అతిపెద్ద అవయవం.. అత్యంత ముఖ్యమైనది చర్మం. అయితే.. దేహంలోని భాగాలకు బయట నుంచి ఎలాంటి హానీ లేకుండా ముందస్తుగా చర్మరం కాపాడుతుంది. 0అలాంటి చర్మం దాదాపు 40 శాతం కాలినా ప్రాణానికి ముప్పే. కాలిన గాయాల ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్‌ శరీరంలోకి చేరి, ఇన్‌ఫెక్షన్లు కలిగించటమే కాదు..మరణానికి దారితీస్తాయి. కాలిన గాయాలకు చికిత్స తీసుకున్నా అంత త్వరగా మానటం కష్టమే. ఈ నేపథ్యంలోనే అగ్నిప్రమాదాల బారినపడిన వారు కోలుకునేలా చేస్తాయి “స్కిన్ గ్రాఫ్ట్”లు. కిడ్నీ, లివర్‌ వంటి అవయవాలను దాతల నుంచి సేకరించి బాధితులకు ఎలాగైతే అందిస్తారో అదేవిధంగా చనిపోయిన వారి శరీరం నుంచి చర్మాన్ని వేరుచేసి… వాటి గ్రాప్ట్‌లు తయారు చేసి రోగులకు అందించవచ్చు.

దేశంలో కేవలం 3 స్కిన్ బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉండగా గతేడాది జూన్‌లో రోటరీ క్లబ్, హెటిరో సంస్థల సహకారంతో ఉస్మానియా ఆస్పత్రిలో ‘చర్మనిధి’ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 18 ఏళ్లు పైబడి
ఎయిడ్స్ వంటి తీవ్ర వ్యాధులు లేకుండా మరణించిన వారి శరీరం నుంచి మనిషి చనిపోయిన ఆరు గంటల్లోపు చర్మాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఒక్కో దేహంతో వెయ్యి నుంచి 2,500 చదరపు సెంటీమీటర్ల చర్మాన్ని సేకరించే అవకాశం ఉంది. కాలిన గాయాలకు చికిత్స అందించే అతిపెద్ద విభాగాన్ని కలిసిన ఉస్మానియా వైద్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. గతేడాదిలో ఆరుగురు మృతుల నుంచి చర్మాన్ని సేకరించిన వైద్యులు… బ్యాక్టీరియా, ఫంగల్ వైరస్‌లు సోకకుండా శుద్ధిచేసి, ఫ్రీజర్లలో భద్ర పరుస్తున్నారు. అలా భద్రపరిచిన వాటినే స్కిన్‌గ్రాఫ్ట్‌గా చెబుతుంటారు. ఒక్కసారి స్కిన్ గ్రాఫ్ట్‌ని ఫ్రీజర్​లో ఉంచితే ఐదేళ్ల వారకు ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news