తెలుగు సినీ ప్రముఖుల్ని సీఎం జగన్ అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నా: సోమిరెడ్డి

-

తెలుగు సినీ ప్రముఖులను సీఎం జగన్ మోహన్ రెడ్డి అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని.. టీడీపీ పోలిట్ బ్యూరఓ సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన అగ్ర తారల్ని సీఎం నివాసం గేటు వద్దే దింపి నడిపిస్తారా.. అంటూ ప్రశ్నించారు. ముఖిళిత హస్తాలతో నమస్కారం పెట్టిన అగ్రహీరోలకు  ప్రతిగా నమస్కారం పెట్టాలనే సంస్కారం సీఎంకు లేకుండా పోయిందని విమర్శించారు. బాహుబలి లాంటి సినిమా చూసిన ప్రధాని తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిందని కొనియాడారని.. సినిమా పరిశ్ర జోలికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లలేదని ఆయన అన్నారు. లేని సమస్యను సినీ పరిశ్రమకు సృష్టించి మళ్లీ పరిష్కరిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని జగన్ ను విమర్శించారు సోమిరెడ్డి. ఓ వైపు సినీ ప్రముఖుల్ని కించ పరిచి, మరోవైపు అఖిలభారత సర్వీసు అధికారుల్ని దారుణంగా అవమానించారన్నారు. సీఎం జగనుకు సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్.. గౌతమ్ సలామ్ అని పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి గౌతమ్ సలామును గంటలో పీకేశారని అన్నారు. కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మా నెల్లూరు ఎస్పీగా పని చేశారని..సవాంగ్ దెబ్బతీసిన పోలీస్ ప్రతిష్టను ఆయన కొంతైనా కాపాడతారేమో చూడాలంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news