అమరావతిలో రాజధానిని మేమే నిర్మిస్తాం : సోము వీర్రాజు సంచలనం

-

అమరావతి రాజధానిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనేనని… రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ చెబుతోందని స్పష్టం చేశారు. అమరావతి చుట్టూ అభివృద్ది చేసింది కేంద్రం కాదా అని ప్రశ్నిస్తున్నానని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందని… ఈ నెల 21న రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతుల పోరాటంలో పాల్గొంటామని ప్రకటన చేశారు.

మచిలీపట్నం నుంచి నెల్లూరు వరకు దళిత‌మోర్చా నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని… రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీలకు కెబినెట్లో స్ధానం కల్పించిన ఘనత బీజేపీదేనని… మోడీ అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశౄరు. ఓట్లు ఎన్ని వేశారో ముఖ్యం కాదు అభివృద్ధే లక్ష్యమని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news