ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ

-

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​ కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఇవాళ ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్​ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.


మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర సర్కార్ విధానానికి వ్యతిరేకంగా గాంధీభవన్​లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు, షబ్బీర్ అలీ, మహేశ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్​కు భాజపా భయపడే ఈడీని పంపిస్తోందని హస్తం నేతలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news