భారత్ జోడో యాత్రలో సోనియా.. కర్ణాటకలో రాహుల్​తో కలిసి..

-

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్​ జోడో యాత్రలో ఆ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ పాల్గొన్నారు. కర్ణాటక మండ్యలో గురువారం రాహుల్​, ఇతర నేతలతో కలిసి సోనియా పాదయాత్ర చేశారు. సోమవారమే మైసూరు చేరుకున్న సోనియా.. దసరా రోజున బేగూర్ గ్రామంలోని భీమనకొళ్లి ఆలయంలో పూజలు చేశారు. గురువారం ఉదయం మండ్యకు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు.
సోనియా గాంధీ కర్ణాటకలో పాదయాత్ర చేసేందుకు రావడం తమకు గర్వకారణం అన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్. విజయదశమి తర్వాత కర్ణాటకలో తమ పార్టీకి విజయం తథ్యమని, బీజేపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు.
భారత్​ జోడో యాత్ర 29వ రోజున కర్ణాటకలో కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ సాగుతోంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాలన్నది ప్రణాళిక.

Read more RELATED
Recommended to you

Latest news