సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం..!

-

భారత్‌లో కరోనా రోజురోజుకు విలయతాండవం చేస్తుంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మరణించారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. డాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది.  సౌరవ్‌ గంగూలీ అన్నయ్య, వారి కుటుంబ సభ్యులైన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ భార్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. అయితే ఇప్పటికే స్నేహాశిష్‌ అత్తమామలు కూడా కోవిడ్ బారినపడ్డారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news