భారత్లో కరోనా రోజురోజుకు విలయతాండవం చేస్తుంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మరణించారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. డాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. సౌరవ్ గంగూలీ అన్నయ్య, వారి కుటుంబ సభ్యులైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహాశిష్ భార్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. అయితే ఇప్పటికే స్నేహాశిష్ అత్తమామలు కూడా కోవిడ్ బారినపడ్డారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది.
సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ వంటి వ్యక్తులు భారతదేశంలోని ముస్లింల పక్షాన వుండరు: మాధవి లత
హైదరాబాద్ లోక్సభ బిజెపి అభ్యర్థి మాధవి లత సెన్సేషనల్ కామెంట్స్ చేసారు....
కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్...
Anji N -
చిల్లరతో నామినేషన్ వేసిన తెలంగాణ యువతి..!
ఓవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం...
Anji N -