Karan Johar: OTTలో ‘కాఫీ విత్ కరణ్’ షో..ఈ సౌత్ సెలబ్రిటీలే గెస్టులు!

-

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఇటీవల.. ‘కాఫీ విత్ కరణ్’ షో ఇక ఉండబోదని ప్రకటించి..అంతలోనే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక టీవీల్లో ఉండబోదని, ఓటీటీ లో షో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ షో ఏడో సీజన్ స్టార్ట్ కానుంది.

ఇప్పటి వరకు ఆరు సీజన్లు ఈ షో పూర్తి చేసుకుంది. ఈ షో లో బాలీవుడ్ సెలబ్రిటీలను కరణ్ జోహార్ తన దైన శైలిలో ప్రశ్నించి సీక్రెట్స్ బయటపెట్టేశారు. త్వరలో ప్రసారం కానున్న సీజన్‌లో బాలీవుడ్‌తో పాటు సౌత్ సెలబ్రిటీలు కూడా హాజరవుతారని టాక్.

 

ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ స్టార్స్ ఫిల్మ్స్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే వారికి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ స్టార్స్ ను కూడా ఈ షోకు ఆహ్వానించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారట.

దక్షిణ భారతదేశంలోనూ ఈ షోను పాపులర్ చేయడంతో పాటు సౌత్ సెలబ్రిటీల విశేషాలను పాన్ ఇండియా వైడ్ తో పాటు నార్త్ ఇండియన్ ఆడియన్స్ కు తెలపాలని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సౌత్ ఇండియన్ స్టార్స్ కు ఆహ్వానం పంపాలని డిసైడ్ అయ్యారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, క్యూట్ బ్యూటీ రష్మిక మందనలను ఈ షోలో గెస్టులుగా ఆహ్వానించాలని అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news