పాకిస్తాన్ తో హై వోల్టేజ్ మ్యాచ్ లో ఓపెనర్లుగా “రోహిత్ – ఇషాన్ కిషన్”

-

పాకిస్తాన్ మరియు శ్రీలంకలు వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతూ ఉంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ నేపాల్ ను చిత్తు గా ఓడించి ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఈ రోజు రెండవ మ్యాచ్ లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఇదిలా ఉంటే, ఆసియా కప్ లో ఇండియా తమ మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 2వ తేదీ శనివారం దాయాధి దేశం అయిన పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా ఓపెనర్లుగా ఎవరిని పంపించాలి మరియు మూడు నాలుగు స్థానాలలో ఎవరిని ఆడించాలి అన్న విషయంలో కృష్ణమాచారి శ్రీకాంత్ టీం ఇండియా యాజమాన్యానికి ఒక సూచన చేశాడు. ఆ ప్రకారం ఓపెనర్లుగా రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ లను ఆడించాలంటూ చెప్పారు, ఇక మూడు మరియు నాలుగవ స్థానాలలో గిల్ మరియు కోహ్లీ లను ఆడిస్తే ఫలితం బాగుంటుందంటూ సలహా ఇచ్చాడు.

మరి ఈ ప్రకారం టీం ఇండియా యాజమాన్యం ఆడిస్తుందా లేదా ప్లాన్ ను మారుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news