Asia Cup 2022 : రేపే పాక్ తో మ్యాచ్..రోహిత్ తో కలిసి ఓపెనింగ్ కు కోహ్లీ!

-

Asia Cup 2022 : ఆసియా కప్ 2022 కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపే పాకిస్తాన్, టీమిండియా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్  జరుగనుంది. దుబాయ్ లోని షేక్ జాయెద్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా తేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో పాక్ చేతిలో ఏదురైన గోరపరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

కాగా టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా, కోహ్లీ వన్ డౌన్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్రవారం రోహిత్, కోహ్లీతో కలిసి నెట్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్ ను సమర్ధంగా ఎదుర్కొంటూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో రోహిత్ కు జతగా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని, కేఎల్ రాహుల్ డిమోట్ అయి వన్ డౌన్ లో రానున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news