క్రికెట్: అరుదైన రికార్డు అందుకున్న అశ్విన్..

-

ఇంగ్లండ్ తో జరుగుతున్న చెన్నై టెస్టులో భారత జట్టు వెనకబడే ఉంది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 578పరుగులు చేయగా, ఇండియా 337పరుగులకే అలౌట్ అయ్యింది. 241పరుగుల లీడ్ తో రెండవ ఇన్నింగ్సు స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ దూసుకుపోతుంది. ఐతే ఈ ఇన్నింగ్సులో భారత బౌలర్ అశ్విన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. మొదటి ఓవర్లో తొలి బంతికే వికెట్ తీసి 114ఏళ్ల తర్వాత ఆ ఘనత అందుకున్నవాడిగా స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు.

టెస్టుల్లో స్పిన్నర్లు మొదటి బౌలింగ్ వేయడం కామనే. కానీ మొదటి బంతికే వికెట్ తీయడం చాలా అరుదు. 1907లో ఇంగ్లాండులో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా బౌలర్ బెర్ట్ వాగ్లర్ ఇలాంటి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అశ్విన్ 114ఏళ్ల తర్వాత మళ్ళీ అశ్విన్ అందుకున్నాడు. అదీగాక అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగవ భారత బౌలర్ గా అశ్విన్ రికార్డుకెక్కాడు.

Read more RELATED
Recommended to you

Latest news