BREAKING : క్రికెటర్ సచిన్ ను బలితీసుకున్న కరోనా..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి క్రికెటర్ సచిన్ దేశ్ముఖ్ మరణించారు. 52 ఏళ్ల దేశ్ముఖ్ ముంబై, మహారాష్ట్ర రంజీ జట్లలో రిజ్వర్డ్ ప్లేయర్‌గా ఉన్నారు.

ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ముంబైలోని వేదాంత్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతిపై మాజీ మహారాష్ట్ర రంజీ ఆటగాడు అభిజిత్ దేశ్‌పాండే విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయనతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news