పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌

-

IPL…. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్​కి ఈ సీజన్ ఓ పండుగ. ఐపీఎల్ ఇప్పుడు మరో సరికొత్త సీజన్​ పనుల్లో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్​ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్​ను నియమించింది.

2023 ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బుధవారం ఆ ఫ్రాంఛైజీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో మయాంక్‌ విఫలమవడంతో కెప్టెన్‌ మార్పు తప్పదనిపించింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌ వెళ్లడంతో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా బాధ్యతలు స్వీకరించిన మయాంక్‌.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించలేకపోయాడు.

“ధావన్‌ను కెప్టెన్‌గా నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఐపీఎల్‌లో ఆటగాడిగా, సారథిగా అతనికి అనుభవముంది. జట్టు తరపునా మంచి ప్రదర్శన చేశాడు” అని పంజాబ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ట్రెవర్‌ బేలిస్‌ రూపంలో జట్టుకు కొత్త కోచ్‌ రానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news