క్రికెట్: ఈ జట్టుతో ప్రపంచ కప్ గెలవడం కలే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్..

-

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 56పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ విజృంభించడంతో జట్టు స్కోరు 6వికెట్లు కోల్పోయి 374 చేరింది. ఐతే ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఇండియా విఫలమైంది. శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా అర్థ సెంచరీలతో పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ళపై విమర్శలు ప్రారంభమయ్యాయి.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మాట్లాడుతూ, భారత జట్టుకి ఆరవ బౌలర్ సమస్యగా మారాడాని, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సరిగ్గా బౌలింగ్ చేయడం లేదని, జట్టు ఫార్మేషన్ ఇలాగే ప్రపంచ కప్ గెలవడం కలే అని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ లోనూ మరింత పటిష్టంగా ఎదగాల్సిన అవసరం ఉందని, రెండవ వన్డేలో అయినా భారత జట్టు మెరిగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news