ఆ విషయంలో కోహ్లీ కంటే రోహిత్ బెటర్..

-

మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్, కోహ్లీ కెప్టెన్సీ పై తనదైన వ్యాఖ్యలు చేసాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ సారథ్యంలో ఐపీఎల్ ఆడిన పార్థివ్ పటేల్, తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ కి వెళ్ళి ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ టీమ్ పై, కెప్టెన్ కోహ్లీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. కెప్టెన్ గా కోహ్లీ కంటే రోహిత్ బెటర్ అని పార్థివ్ పటేల్ చేబుతున్నాడు.

కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ శర్మ చురుగ్గా ఉంటాడని, అందుకే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అన్ని సార్లు కప్పు గెలుచుకుందని చెప్పాడు. నిర్ణయాలు తీసుకోవడంలో కోహ్లీ, రోహిత్ కంటే వెనకే ఉన్నాడు. కెప్టెన్ గా రోహిత్ చాలా బెటర్ అని అన్నాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అక్కడ ఎలిమినేటర్ మ్యాచులో సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news