వామప్ మ్యాచ్ లో బమ్రా దెబ్బకు రోహిత్ శర్మ విలవిల

-

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టారైష్ర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతోంది. సాధారణంగా ఏ మ్యాచ్ అయినా భారత ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టు లోని క్రికెటర్లతో పోటీ ఎదురవుతోంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం భారత్ కు భారత ఆటగాళ్ళే ప్రత్యర్థులు అయ్యారు. ఇది అనధికార మ్యాచ్ కావడంతో ఎక్కువ మందికి ప్రాక్టీస్ అవకాశం కల్పించేందుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, రిషబ్ పంత్, ఛటేశ్వర్ పూజారా,లీసెస్టార్షైర్ తరపున బరిలోకి దిగారు.

అయితే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు లీసెస్టర్ కౌంటీ బౌలర్లతో పాటు బుమ్రా,ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తన యార్కర్లు, బౌన్సర్ లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్ పేసర్ బూమ్రా ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏ మాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు తన బౌలింగ్ పదును చూపెట్టాడు. ఈ క్రమంలో ఏడోవ లో బమ్రా వేసిన బంతి రోహిత్ శర్మ గజ్జల్లో తగలడంతో నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్ కాసేపు మోకాళ్లపై కూర్చుని పోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ కొనసాగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news