దీప్తి శర్మకు సచిన్ సపోర్టు.. ఆమె చేసింది కరెక్టేనంటూ..

-

​ఇండియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇటీవల క్రికెటర్​ దీప్తి శర్మ చేసిన రనౌట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దీప్తికి పలువురు మద్దతుగా నిలుస్తుండగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ బ్యాటర్ ఛార్లీ డీన్‌ను రనౌట్ చేయడంలో దీప్తి శర్మ ఎలాంటి తప్పు చేయలేదని సచిన్ స్పష్టం చేశాడు. క్రీడా స్ఫూర్తిపై అడిగిన ప్రశ్నకు సచిన్ ఈ సమాధానం ఇచ్చాడు. నియమ నిబంధనల ప్రకారం ఎలా ఆడినా క్రీడా స్ఫూర్తిగానే చూడాలని చెప్పాడు.

“నాన్‌ స్ట్రైకర్‌ క్రీజ్‌ నుంచి బయటకొచ్చినప్పుడు ఐసీసీ నియమం ప్రకారం రనౌట్‌ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అది రూల్. స్ట్రైకింగ్‌ చేస్తున్న బ్యాటర్ ఎల్బీడబ్ల్యూగా ఎలా పెవిలియన్‌కు చేరతాడో.. అలానే నాన్‌స్ట్రైకింగ్‌ ప్లేయర్‌ కూడా క్రీజ్‌లో లేకపోతే ఇలా రనౌట్‌గా ఔటయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి వివాదాలు రాకూడదని ఐసీసీ కొత్త రూల్‌ను పరిచయం చేసింది. బంతి పడకముందే క్రీజ్‌ను దాటి ముందుకొస్తే తప్పకుండా రనౌట్ అవుతారు. ఇక ఆ మ్యాచ్‌లో దీప్తి శర్మ ఐసీసీ నిబంధనల ప్రకారమే ఆడింది” అని సచిన్‌ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news