అర్జున అవార్డు అందుకున్న టీమిండియా స్టార్ ఓపెన‌ర్

-

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ శిఖ‌ర్ దావ‌న్ అర్జున అవార్డు ను అందుకున్నాడు. కాగ శ‌నివారం రోజ‌న రాష్ట్రప‌తి రామ్ నాథ్ కొవింధ్ చేతుల మీదుగా శిఖ‌ర్ దావ‌న్ అర్జున అవార్డు ను అందుకున్నాడు. ఈ సంద‌ర్భంగా శిఖ‌ర్ దావ‌న్ మాట్లాడుతూ దేశంలో గొప్ప అవార్డు లలో ఒక‌టి అయినా అర్జున అవార్డు అందుకోవాడం చాలా గ‌ర్వంగా ఉంది. అని అన్నాడు. అయితే శిఖర్ దావ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమిండియా త‌రపున 34 టెస్టు, 145 వ‌న్డే, 66 టీ ట్వంటి మ్యాచ్ లు ఆడాడు.

అయితే ఇప్ప‌టి వర‌కు టెస్టుల‌లో 2,315 , వ‌న్డే ల‌లో 6,105 , టీ ట్వంటి ల‌లో 1,719 ప‌రుగులు సాధించాడు. అందులో టెస్ట్ క్రికెట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 శ‌త‌కాలు, 5 అర్థ శ‌త‌కాలు బాదాడు. అలాగే వ‌న్డే ల‌లో 17 సెంచ‌రీలు, 33 అర్థ సెంచ‌రీలు న‌మోదు చేశాడు. దీంతో పాటు టీ ట్వంటి క్రికెట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అలాగే ఐపీఎల్ లో కూడా శిఖ‌ర్ దావ‌న్ కు మంచి గుణాంకాలు ఉన్నాయి. చివ‌రి ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పుణ శిఖ‌ర్ ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news