ఇన్స్టాగ్రామ్ లో అరుదైన ఘనత అందుకున్న కోహ్లీ..

-

భారత క్రికెటర్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో వంద మిలియన్ల ఫాలోవర్లను ఏర్పర్చుకున్నాడు. అంటే పదికోట్ల అనుచరులు ఇన్స్టాగ్రామ్ ద్వారా కోహ్లీని ఫాలో అవుతున్నారన్నమాట. ఇండియా నుండి ఈ అరుదైన ఘనత అందుకుంది కేవలం కోహ్లీనే. ప్రపంచ క్రీడాకారులల్లో వంద మిలియన్లు అందుకున్నవారు కొద్ది మందే ఉన్నారు.

క్రిస్టియన్ రొనాల్డో, లియోనల్ మెస్సీ, బెయాన్స్, నైమర్ జూనియర్, డ్వేన్ జాన్సన్, మొదలగు వారు వంద మిలియన్ల అభిమానగణాన్ని సంపాదించుకోగా, ఈ జాబితాలో కోహ్లీ 23వ వాడిగా ఉన్నాడు. ధోనీ కూడా కోహ్లీ తర్వాతే ఉన్నాడు. ఇండియాలో కోహ్లీ తర్వాత బాలీవుడ్ నటీమణులు ప్రియాంకా చోప్రా, శ్రధ్ధాకపూర్ ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నారు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ, ఇంగ్లండ్ తో జరిగే నాలుగవ టెస్ట్ కి సిద్ధం అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news