IPL 2023 : ధోని అభిమానులకు అదిరిపోయే శుభవార్త

-

ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ప్లేయర్లు అందరూ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఆసియా కప్ 2022 కౌంటి లీగ్ రంజీ మ్యాచ్ లలో పాల్గొంటున్నారు. వచ్చే నెల ఆరంభం కాబోయే టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసము ఆయా ప్లేయర్ లందరూ సమాయాత్తవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ధోని అభిమానులకు తీపి కబురు చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఐపిఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ వన్ ఇండియా ట్వీట్ చేసింది. ఎంఎస్ ధోని సారథ్యంలో తాము ఐపీఎల్ 2023లో ఆడబోతున్నామని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదనే విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news