స్టాట్ అయిన‌ పోలింగ్‌.. అధ్యక్షుడు ఎవరో..?

-

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆ రోజు ఉద‌యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 225 మంది సభ్యులు ఉండగా అధ్యక్ష పదవి కోసం అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్ పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 230 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఎన్నిక‌లు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు అధికారులు తెలియ‌చేశారు. ఇక అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌ ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధ్య‌క్ష ప‌ద‌వి సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news