భారత్ బ్యాటింగ్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్

-

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ ఫస్ట్ టైమ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 5 మ్యాచ్ ల్లో కూడా ఛేజింగ్ చేసింది భారత్.. ఛేజింగ్ చేసిన అన్ని మ్యాచ్ ల్లో భారత జట్టే గెలిచింది. అయితే టీమిండియా గెలుపు దాహంతో ఉన్న ఇంగ్లండ్ ముందు కనీసం 350 కి పైగా టార్గెట్ ఉంచాల్సిందే. లేదంటే ఇంగ్లండ్ గెలిచే అవకాశముంది.


భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ జట్టు : బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లివింగ్ స్టోన్, మొయన్ అలీ, క్రిసో వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ తుది జట్టులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news