ఐపీఎల్ 2023: రసవత్తరంగా మారిన “ప్లే ఆప్స్” వార్… !

-

గత రాత్రి ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా కోల్కతా పంజాబ్ ను అయిదు వికెట్ల తేడాతో ఓడించడంతో ప్లే ఆఫ్ లో ఇంకా బ్రతికే ఉంది. వాస్తవంగా అయితే ఈ మ్యాచ్ లో కనుక కోల్కతా ఓడి ఉంటే ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించేదే. కానీ సినియర్ ఆటగాడు ఆండ్రే రస్సెల్ కీలక సమయంలో రాణించడంతో ఇంకా నిలిచి ఉంది. కాగా ప్రస్తుతం దాదాపుగా పోటీలో ఉన్న పది జట్లలో ఎనిమిది జట్లకు ప్లే ఆప్స్ చేరడానికి అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ లు గెలిచి దాదాపుగా ప్లే ఆఫ్ కు చేరినట్లే, ఇక ఆ తర్వాత ఎక్కువగా ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం చెన్నై కు ఉంది. ఈ రెండు స్థానాలు మాత్రం పక్కా అని తెలుస్తోంది.

మిగిలిన జట్లు అందరికీ మిగతా రెండు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.. కానీ ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. మరి చివరికి ఏ నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరనున్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news