ఈనెల 23న IPL వేలం..రూ.2 కోట్ల లిస్టులో లేని భారత ప్లేయర్లు వీరే

-

IPL 2023 : 2023 ఐపీఎల్ సీజన్ కు జరిగే వేలంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈనెల 23న కోచి వేదికగా ఈ మినీ యాక్షన్ జరుగుతుందని ప్రకటించింది. ఈ టోర్నీకి ఈసారి 991 మంది రిజిస్టర్ అయ్యారని, వీరిలో 714 మంది భారతీయులు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని బోర్డు పేర్కొంది.

ఈ టోర్నీకి దరఖాస్తు చేసుకున్న విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియన్లే ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో సఫారీ, విండీస్ జట్లు నిలిచాయి.

డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుండగా రూ.2 కోట్లు, రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో ఒక్క భారతీయ ప్లేయర్ కూడా లేడు. సామ్ కరన్, కామెరున్ గ్రీన్, అదిల్ రషీద్, స్టోక్స్, పురన్, రూసో, విలియంసన్, డస్సేన్, హోల్డర్ తదితర ప్లేయర్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ లో ఉన్నారు. బ్రావో, స్టీవెన్ స్మిత్, లబుషేన్ వేలంలో పాల్గొనట్లేదు. మొత్తం 991 మంది ప్లేయర్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news