ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానికి షాక్ ఇచ్చిన ధోనీ.. ఏం జ‌రిగిందంటే..?

-

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ లు, కార్లంటే ఎంతో మోజు. ఇటీవల ధోనీ నిస్సాన్ జోంగా కారు కొన్నాడు. మరోవైపు ధోనీ వద్ద దాదాపు 74 బైకులున్నాయి. అయితే జార్ఖండ్‌కు చెందిన ఓ అభిమానికి తాను కొన్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై నేరుగా రాంచీలోని స్టేడియానికి చేరుకున్నాడు. అదే సమయంలో ధోనీ ప్రాక్టీస్ ముగించుకుని బయటకు వస్తున్నాడు. అప్పుడే స‌ద‌రు అభిమాని సెక్యూరిటీని దాటుకొని ధోనీ దగ్గరికెళ్లి కొత్త బైక్ విషయం చెప్పి ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు.

అయితే బైక్ లపై తనకున్న ఇష్టాన్నిధోనీ వ్యక్త పరుస్తూ.. సదరు అభిమాని వాహనం బుల్లెట్ ఎన్ ఫీల్డ్ పై సంతకం చేసి షాక్ ఇచ్చాడు. ఈ ఘటనతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ బైక్ ను జీవితాంతం కాపాడుకుంటానని అన్నాడు. ధోనీ ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news