భారీగా పెరిగిన బంగారం.. ప‌త‌న‌మైన వెండి..

-

పసిడి ధర పెరుగుతూనే వస్తోంది. అయితే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీస్థాయిలో పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,410 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయలు పెరిగింది. దీంతో 37,050 రూపాయల వద్దకు చేరుకుంది. కాగా, వెండి ధరలు రెండోరోజూ భారీగా తగ్గాయి. వెండి ధరలు ఆదివారం కేజీకి ఏకంగా 9500 రూపాయలు తగ్గాయి.

ఈమధ్యకాలంలో వెండి ధరల్లో భారీ పతనం ఇది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 39,000 రూపాయలకు దిగివచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,430రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,050 రూపాయలకు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news