విరాట్-రోహిత్‌లను తిట్టినందుకు స్నేహితుడినే నరికి చంపిన వ్యక్తి

-

తమిళనాడులోని అరియలూరు జిల్లాలో చోటు చేసుకుంది.తన ఫేవరెట్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలను దూషించాడనే కారణంతో స్నేహితుడిని కొడవలితో అతికిరాతకంగా నరికి చంపేశాడు ఓ క్రికెట్ అభిమాని. తమిళ మీడియా కథనాల మేరకు గత గురువారం చోటు చేసుకున్నట్లు చెబుతున్న ఈ ఘటనలో నిందితుడు, చనిపోయిన వ్యక్తి ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తోంది.


వీరిద్దరూ మద్యం సేవిస్తుండగా క్రికెట్ గురించి చర్చ వచ్చిందని, ఈ సందర్భంగా మృతుడు, క్రికెటర్లు రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని బూతులు తిట్టాడని సమాచారం. తన అభిమాన క్రికెటర్లను తిట్టడాన్ని సహించలేకపోయిన నిందితుడు, తన స్నేహితుడిని కొడవలితో అతికిరాతకంగా నరికి చంపాడని తెలుస్తోంది. విషయం తెలిసి స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news