ధోనీనే కాదు, నేను కూడా క్రికెట్ వదిలేసా: పాకిస్తాన్ ధోనీ ఫ్యాన్…!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కాదు క్రికెట్ ని తాను కూడా వదిలేసా అని చెప్పాడు పాకిస్తాన్ కి చెందిన ఒక క్రికెట్ అభిమాని. 2011 నుంచి ధోనీ ఫ్యాన్ గా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పాకిస్తాన్ కి చెందిన చికాగో చాచా నేడు క్రికెట్ పై కీలక వ్యాఖ్యలు చేసాడు. రానున్న రోజుల్లో ఇక తను క్రికెట్ కోసం ప్రయాణం చేసేది లేదు అని ఒక ప్రకటన చేసాడు.

గొప్ప వాళ్ళు అందరూ ఏదోక రోజు తప్పుకోవాలి అని, కాని ధోనీ విరమణ చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రయాణ పరిమితుల విధించకపోతే ఐపిఎల్ 2020 కోసం యుఎఇకి ప్రయాణించేవాడని చాచా చికాగో చెప్పారు. అతను ధోనీని అభిమానించడంపై పాకిస్తాన్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను మళ్ళీ ఆడితే బాగుండు అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news