Ambati Rayudu: మైదానంలో మళ్లీ గొడవ.. యువ ప్లేయర్‌తో తెలుగు తేజం వాగ్వాదం!

-

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఎదో ఒక గొడవ చేసుకుంటూ, వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, యంగ్ క్రికెటర్ షేల్డన్ జాక్సన్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో భాగంగా ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్ గ్రూపు డీ లో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షేల్డన్ జాక్సన్ తో అంబటి రాయుడు ఏదో విషయం విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్ళిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news