టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

-

టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ టార్గెట్ ముందుంచాలని టీమిండియా భావిస్తుండగా.. అప్గనిస్తాన్ ని తక్కువ స్కోరు కి ఎలా కట్టడి చేశామో.. టీమిండియాను కూడా అలాగే కట్టడి చేసి ఈ సారి ఎలాగైనా సరే కప్ గెలవాలని భావిస్తోంది. హారా హోరీగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం ఎవ్వరినీ వరిస్తుందనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.

టీమిండియా తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్జీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జీప్రీత్ బుమ్రా.

సౌతాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఫెడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, ఆన్రిచ్ నోకియా, తంబ్రెజ్ షంపంసి.

 

Read more RELATED
Recommended to you

Latest news