మూడో టి20; టీం ఇండియా బ్యాటింగ్…!

-

భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరిది అయిన మూడో టి20లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పూణేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించడం అనేది శ్రీలంకకు చాలా అవసరం. మొదటి మ్యాచ్ రద్దు కావడం రెండో మ్యాచ్ లో టీం ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ ని సమం చెయ్యాలని శ్రీలంక పట్టుదలగా ఉంది.

అటు టీం ఇండియా కూడా శ్రీలంకపై విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతుంది. ఎలా అయినా సరే ఈ మ్యాచ్ లో విజయం సాధించి శ్రీలంకపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య 10 టి20 మ్యాచులు జరగగా భారత్ 9 మ్యాచుల్లో టీం ఇండియా విజయం సాధించింది. పూణేలో జరిగిన ఒక మ్యాచ్ లో 2017 లో గెలిచిన శ్రీలంక తమకు గ్రౌండ్ కలిసి వస్తుందని భావిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టీం ఇండియా తరుపున ఓపెనర్లు గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ రానున్నారు. తుది జట్టులో టీం ఇండియా ఏ మార్పులు చేయలేదు. శ్రీలంకకు మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ లో పరిస్థితిని బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news