IND vs Pak : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు..6 నిమిషాల్లో

-

చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది! ఇరుదేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరుకు ఆసియా కప్ వంటి మెగా టోర్నీ వేదికగా అయితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం.

ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 28న దుబాయ్ వేదికగా దాయాది దేశాలు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్ ఉండే క్రేజ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. సోమవారం టికెట్లను అందుబాటులో ఉంచిన ఆరున్నర నిమిషాల్లోనే మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయి.

దీంతో టికెట్ లభించక చాలామంది నిరాశకు గురయ్యారు. స్వాతంత్ర దినోత్సవం రోజు అమ్మకాలు ఉంటాయని నిర్వాహకులు ముందుగానే ప్రకటించడంతో టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు. సుమారు 75 వేల మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు సైట్ లో క్యూ సిస్టం ను తీసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకే ఏడున్నర లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే టికెట్లు తక్కువ ఉండడంతో రాత్రి అమ్మకాలు మొదలుపెట్టిన నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news