IPL 2023 : మళ్లీ కలిసిపోయిన కోహ్లీ, గంగూలీ..ఫోటో వైరల్‌

-

ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. గెలిచిన, ఓడిన ప్లే ఆఫ్ చేరే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ధనాదన్ షాట్లతో స్వేచ్ఛగా ఆడారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా బాగానే ఆడింది. కానీ చివరల్లో చేతులెత్తేసింది.

డూప్లెసెస్, కోహ్లీ, లోమ్రోర్ చక్కగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళు ముగ్గురు రాణించడంతో నిర్నిత 20 ఓవర్లలో ఈ జట్టు 181 పరుగులు చేసింది. ఇక అటు ఢిల్లీ బ్యాటర్లు.. దాటిగా ఆడటంతో.. ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు. అయితే, మ్యాచ్‌ అనంతరం.. ఎప్పుడు సీరియస్‌ గా ఉండే… కోహ్లీ, గంగూలీ సరదాగా చేతులు కలుపుకున్నారు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని కలిసిపోయారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news