శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్.. ట్రైలర్ అదిరింది.

-

యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ పేరుతో సినిమా తెరకెక్కింది. రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కీల పాత్రదారులుగా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ట్రైలర్ ప్రకారం, రాజా రవీంద్ర, మనో, భరణి పాత్రలు తమ జీవిత భాగస్వామితో సరిగ్గా ఉండకుండా ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వారికి శ్రీముఖి పాత్ర కనిపిస్తుంది. తనని దక్కించుకోవడానికి ఈ ముగ్గురు అంకుల్స్ ఏం చేసారన్నది ఆసక్తికరంగా ఉంది.

ట్రైలర్ పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. శ్రీముఖి పాత్ర కాస్త బోల్డ్ గా కనిపించింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఈ సత్తిబాబు డైరెక్ట్ చేసారు. గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్, బొడ్డు అశోక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. మరి అదే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ క్రేజీ అంకుల్స్ తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news