బిగ్ బాస్ షో పై మరొకసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..!!

-

టాలీవుడ్ లో పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇక ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎప్పుడు ఫిలింనగర్లో జరిగేటువంటి విషయాలపైన మాట్లాడుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి యూట్యూబ్లో పలు వీడియోలను చేస్తూ తన సమయాన్ని అలాగే గడిపేస్తోంది ఈమె. ఈ సందర్భంగా తాజాగా ఒక ఛానల్ తో చిట్ చాట్ నిర్వహించగా ఈమె ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

బిగ్ బాస్ లో అవకాశం వస్తే మీరు వెళ్తారా అనే ప్రశ్న యాంకర్ అడగగా.. శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. చస్తే బిగ్ బాస్ కు వెళ్లనంటూ సమాధానాన్ని తెలియజేసింది. అందులోకి వెళ్లి తనకి ఉన్న పరువు కూడా పోగొట్టుకోవడం తప్ప అందువల్ల ఉపయోగం ఏమీ లేదని తెలియజేసింది. అందులోకి వెళ్లిన వారంతా కాస్త డబ్బులు వెనకేసుకోవచ్చేమో కానీ పరువు, క్యారెక్టర్ ని పోగొట్టుకొని బయట నిలబడిన వారు చాలామంది ఉన్నారని తెలియజేసింది శ్రీరెడ్డి. ఒకవేళ తనకు అనుకోకుండా అవకాశం వచ్చినా కానీ తాను అలాంటి హౌస్ లోకి మాత్రం వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.

బిగ్ బాస్ అట్టర్ ప్లాప్ షో అని.. నాగార్జున అలాంటివి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు కానీ నాగార్జున మీసాలకు జుట్టుకు రంగు వేసుకుని ఒక పూల చొక్కా వేసుకొని బిగ్ బాస్ సభ్యులు రాసిచ్చిన ప్రశ్నలను అడిగితే సరిపోతుందా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇక బిగ్ బాస్ షో పైన సిపిఐ నారాయణ కూడా పలు సందర్భాలలో తప్పుపడుతూ ఉంటారని తెలియజేసింది. ఇక ఈ షో పైన కోర్టులో కేసు కూడా జరుగుతోందని తెలియజేసింది. ఇక ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు వున్న ఇలాంటి షో ఫ్యామిలీ టైం లో ప్రసారం చేస్తున్నారని ఇలాంటి వాటిని బ్రోతల్ హౌస్ అంటారని తెలియజేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news