సోషల్ మీడియాలో ఘాటు కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.!

-

ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును వున్న కత్తిలా తయారైంది. చాలా మంది దీనిని ఉపయోగించి కొత్త కెరియర్ స్టార్ట్ చేసి ఉన్నత స్థానంలో నిలిచారు. ఒకప్పుడు సామాన్య ప్రజలకు తన మనసులోని భావనను చెప్పుకోవడానికి సరైన వేదిక ఉండేది కాదు. టీవి ఛానెల్ లు, పేపర్స్ బడా బాబుల చేతుల్లో ఉండేవి. దీనితో సామాన్య జనం దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే వారి గొంతుకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాను కొంత మంది విషం కక్కడానికి ఉపయోగిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే రీసెంట్ గా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన పాత అనుభవాల గురించి అలాగే రాజకీయాల గురించి పలు ఆసక్తి గల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలి అంటే రాటు దేలి ఉండాలని, నేను రాజకీయాలకు సూట్ కాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి, అనిపించుకోవడానికి రెండింటికి సిద్ధంగా ఉన్నాడని, ఏదో ఒక రోజు అతను విజయం సాధిస్తాడు అని అన్నారు.

ఇక దీనిపై మన కాంట్రవర్సీ అక్క శ్రీ రెడ్డి ఫేస్ బుక్ లో ఒక రేంజ్ లో విరుచుకు పడింది.ఈయన దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.. వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు.. ఈ వెధవ.. పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట.. ఇంకొకసారి ఈ విషపురుగు గాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని నేను చెప్పే అంత సీన్ నాకు లేదు కానీ ఆర్డర్ నే అంటూ రాసుకు వచ్చింది. ఇలా రాయడం పై నెటిజన్స్ శ్రీ రెడ్డి పై విరుచుకుపడ్డ పడ్డారు. నీకు ఇష్టం ఉన్న నాయకులను ఎంతైనా పోగుడుకో,కాని వేరే వారి పై విషం చిమ్మితే ఎలా, చిరంజీవి మాట్లాడిన దానిలో తప్పు ఏముంది, ఆయన వాళ్ల తమ్ముడు గురించి చెప్పాడు కాని ఎవరిని విమర్శించలేదు అని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news