సైమా అవార్డు ఫంక్షన్ కోసం శ్రీముఖి పారితోషకం అన్ని లక్షలా..?

-

బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో వాక్చాతుర్యంతో చూపర్లను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ అందంలో కూడా అంతకుమించి అనేలా వస్త్రధారణతో కుర్ర కారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా తాజాగా బెంగళూరులో జరిగిన పదవ సైమా అవార్డు కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ ఆలీతో పాటు శ్రీముఖి కూడా యాంకర్ గా వ్యవహరించింది. ఇక సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిని కనబరిచే సైమా అవార్డు వేడుకలలో యాంకర్ గా వ్యవహరించే అవకాశం రావడంతో శ్రీముఖి తన ప్రతిభను ప్రదర్శించింది. అంతేకాదు ఆమె స్టేజిపై చేసిన సందడికి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.

నిజానికీ సైమా అవార్డు వేడుకలలో అన్ని భాషలకు సంబంధించి ఒక్కొక్క యాంకర్ ఉంటారు. అలా తెలుగు యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించింది. ఇక తమిళ్, కన్నడ, మలయాళం నుండి కూడా యాంకర్స్ వచ్చారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే వారందరి కంటే కూడా శ్రీముఖి అధికంగా పారితోషకం తీసుకున్నట్లు సైమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. సైమా అవార్డు ఫంక్షన్లో రెండు రోజుల డేట్లు ఇచ్చినందుకు ఈమె ఏకంగా 15 లక్షల రూపాయల పారితోషకం తీసుకుందని సైమా నిర్వాహకులు నుంచి అందుతున్న సమాచారం. ఇక అందులో విమాన ప్రయాణ ఖర్చులు ఇతర ఖర్చులు మొత్తంగా రూ.2.50లక్షలు తీసివేసిన సుమారుగా రూ.12.50 లక్షలు ఈమె సొంతం అయినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఒకవైపు బుల్లితెరపై పలు షోలలో చేస్తూ యాంకర్ గా తన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీముఖి ఇలా సైమా అవార్డ్స్ లో కూడా మెరిసి తన ఇమేజ్ ను మరింత పాపులర్ చేసుకుంది. అంతేకాదు తన అందంతో కూడా సెలబ్రిటీలను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news