పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ రూల్స్ లో మార్పులు..!

-

పెన్షనర్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈరోజు నుండి రూల్స్ ని మార్చింది. మొత్తం రెండు రూల్స్ ని సరళతరం చేశాయి రెగ్యులేటరీ సంస్థలు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మెచ్యూరిటీ సమయంలో పెన్షన్ కార్పస్ నుంచి బయటకి వచ్చినా ఇక నుండి యాన్యుటీ కోసం వేరే ప్రపోజల్ ఫామ్‌ను పింఛనుదారులు సబ్మిట్ చెయ్యాల్సిన పనే లేదు.

ఎన్‌పీఎస్ రిటైరీ సమర్పించే ఎగ్జిట్ ఫామ్‌నే ప్రపోజల్ ఫామ్‌గా వుంచుతున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు యాన్యుటీ ప్రొడక్టును ఎగ్జిట్ ఫామ్ ని సబ్మిట్ చేసాక ఇస్తాయి. అలానే లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేసేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ సరే అంటోంది.

ఇప్పుడైతే ఎన్‌పీఎస్ పెన్షనర్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ సమగ్ర రూపంలో ఎగ్జిట్ ఫామ్‌ను సబ్మిట్ చెయ్యాల్సి వుంది. నెక్స్ట్ యాన్యుటీ ప్లాన్లను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రపోజల్ ఫామ్‌ను కూడా నింపాలి.

ఎగ్జిమ్ ఫామ్‌లో అన్ని రకాల వివరాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రపోజల్ ఫామ్‌లో కావాల్సిన సమాచారాన్ని అక్కడి నుంచి తీసుకోవచ్చని అంది. దీనితో వేరేగా ఫామ్ ని సబ్మిట్ చెయ్యక్కర్లేదు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకునేందుకు కూడా ఐఆర్‌డీఏఐ అనుమతిస్తోంది. సర్క్యులర్ ని దీని కోసం పంపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news