కొందరు లుచ్చా నా కొడుకుల పనే… ఎన్నికల అఫిడవిట్ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల ఎఫిడవిట్‌ పై వివాదం కొనసాగుతున్న సంగతి మనకు విధితమే. అయితే.. ఈ వివాదంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు.నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు…బురద చల్లు తున్నారనొ.. ఒక మాజీ మంత్రి ,ఒక మాజీ ఎంపీ తో పాటు ఒకరిద్దరు రండలు చేస్తున్న లుచ్చా నాటకం ఇది అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

ఆధారాలతో సహా త్వరలో వాళ్ళ పేర్లు బయటపెడ్తామని.. గతంలో లుచ్చా నా కొడుకులు ఓటరు జాబితా నుంచి నా ఓటు తీయించే ప్రయత్నం చేశారని ఫైర్‌ అయ్యారు. నేను నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు నన్ను టార్గెట్ చేశారని.. బి పార్మ్ తో పాటు ఇచ్చిన అఫిడవిట్ మాత్రమే ఫైనల్ అని చెప్పారు. వెహికిల్ చాలన్ కట్టలేదని కేసు పెడితే ఎలక్షన్ లో ఎవరు మిగలరని మండి పడ్డారు. నా అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేస్తే…విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది …డిసెంబర్ 2021లో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ విచారణ ను ముగించిందని వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీయాలన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణ లో ఉన్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news