నవంబర్‌ 8న శ్రీవారి ఆలయం మూసివేత – TTD

-

నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ఈవో ప్రకటించారు. ఎనిమిదో తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటన చేశారు.

డిసెంబరు ఒకటి నుంచి విఐపి బ్రేక్ దర్శన సమయం 8 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నెలరోజుల పరిశీలన తర్వాత పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు టిటిడి ఈవో. ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 24వ తేదీన గజవాహనం, 25న గరుడ వాహనం అలాగే 27న రథోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news