చంద్రబాబు వల్లే రాష్ట్రానికి రాజధాని సమస్య – ఎమ్మెల్యే పిన్నెల్లి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సమస్య వచ్చిందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం జగన్ పై విమర్శలు చేయాలని సెటైర్లు వేశారు.

ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ విచారణ మేరకు దోషులకు శిక్ష పడుతుందని అన్నారు. దీనిపై రాజకీయం చేయడం తగదని హితవు పలికారు పిన్నెల్లి. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పైరవీలకు చెక్ పడిందన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news