ఫసిఫిక్ మహా సముద్రంలో వింత..షాక్ అవుతున్న శాస్త్రవేత్తలు..

-

మాములుగా సముద్రాలలో కొన్ని రకాల వింత వస్తువులు బయట పడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాము.అయితే అవి చిన్న వస్తువులు.లేదా ఏదైనా ఒడలు మునిగి పోవడంతో కొన్ని వస్తువులు సముద్ర అడుగు భాగాన ఉంటాయి.వాటి గురించి అందరికి తెలుసు.కానీ సముద్ర అడుగు బాగాన ఇటుకలు ఉండటం ఎప్పుడైనా చుసారా..కనీసం ఎప్పుడైనా విన్నారా..అది కూడా సముద్ర ఆడుగున ఉండటం అనేది బహుశా విని ఉండరు.ఇప్పుడు మహసముద్రాల లో ఒక టైన పసిఫిక్ లో ప్రజలు పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించే జాడలు అనేకం ఉన్నాయి.

ఎన్నో దేశాలను ఈ సముద్రం కలుపుతుంది..కాగా, తాజాగా ఈ ఫసిఫిక్ మహా సముద్రంలో ఓ అద్భుత ఆనవాళ్లు సైంటిస్టులు గుర్తించారు. సముద్ర గర్భంలో పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన ఓ రోడ్డు ఆనవాళ్లుని కనుగొనడం జరిగింది. హవాయ్ దీవులకు ఉత్తరాన సముద్ర గర్భంలో పరిశోధిస్తుండగా ఈ రోడ్డు కనబడిందని చెబుతున్నారు..ఆ రోడ్డు నిర్మాణం ఇప్పటిది కాదు కొన్నేళ్ళ క్రితం ఏర్పడి ఉంటుందని అంటున్నారు.

ఈ విషయం పై శాస్త్ర వేత్తలు మరింత క్షుణ్ణంగా పరిసీలించారు.దాంతో ఖంగు తినే విషయాలు వెలుగు చూసాయి.రోడ్డు ఉన్న ప్రదేశంలో ఓ పురాతన సరస్సు ఉండేదట. అయితే అది కాలక్రమేణా ఎండిపోయిందని తెలుసుకున్నారు. సరస్సు ఎండిపోయిన క్రమంలో ఈ పసుపు రంగు రాళ్ల రోడ్డు ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు. ప్రాచీనకాలంలో భూమిలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్లవలన ఈ పసుపు రంగు రాళ్లు ఏర్పడ్డాయని అంటున్నారు. అలాగే వేడి, చల్లదనాల వల్ల పసుపు రంగు రాళ్లకు పగుళ్లు వచ్చి ఉండవచ్చునని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం న్యూస్ ద్రావానంలా వ్యాపించింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news