పోరాటాలు నాకు కొత్తకాదు.. ధైర్యంగా ముందుకెళ్తాం: వైఎస్ జగన్

-

ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నట్లు జగన్ తెలిపారు. మంచి చేయడానికి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.ఎవరు ఏం చేసినా తమకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని వైఎస్ జగన్ చెప్పారు. ‘కచ్చితంగా మళ్లీ లేస్తాం. గుండె ధైర్యంతో అడుగు ముందుకేస్తాం అని ఆశా భావం వ్యక్తం చేశారు.ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు.

పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. నా రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం ప్రతిపక్షంలోనే ఉన్నా అని గుర్తు చేశారు. ఎవరూ చూడని కష్టాలు చూశా. ఇప్పుడు అంతకంటే కష్టాలు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధం. ప్రభుత్వంలోకి వచ్చినవాళ్లకు ఆల్ ది బెస్ట్’ అని వైఎస్ జగన్ తెలిపారు.’పడిన చోటు నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తాం. ఇది పెద్దవాళ్ల కూటమి. మాకు తోడుగా నిలబడిన వారికి కృతజ్ఞతలు’ అంటూ జగన్ ప్రసంగం ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news