కాగజ్‌నగర్‌ కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యార్థిని మృతి

-

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. తమ కూతురు చనిపోయిన విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

అంకుసాపూర్‌కు చెందిన ఐశ్వర్య విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. ఉదయం ఆమె అస్వస్థతకు గురవ్వటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించామని పాఠశాల సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతూ ఐశ్వర్య మృతి చెందిందని పేర్కొన్నారు. తమకు యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహంతో విద్యాలయం ముందు ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news