స్టూడెంట్స్ వివాదం.. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి!

-

ఈ మధ్యకాలంలో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతున్నారు. పట్టుదల, పంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

students-fight
students-fight

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ ఏర్పడింది. రెండు పాఠశాలల విద్యార్థుల మధ్య ఏర్పడిన ఘర్షణ దారుణానికి దారి తీసింది. ఈ ఘర్షణ సమయంలో స్థానికులు విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారిపై కూడా దాడికి దిగారు. అయితే ఈ రెండు పాఠశాలల విద్యార్థులకు గత కొన్ని రోజులుగా బస్టాండ్ దగ్గర బస్సు ఎక్కే విషయంలో విబేధాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గొడవకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news