సంగారెడ్డిలో ఘోరం… ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

-

సంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. స్థిరాస్తి వ్యాపారం కుటుంబంలో గొడవకు కారణమైంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో దంపతుల్లో గొడవలు చెలరేగాయి. ఈ గొడవలే నలుగురు మరణానికి దారి తీశాయి. భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా బలి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. నిన్న రాత్రి భర్తతో గొడవ పడిన భార్య లావణ్య తన పిల్లను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త చంద్రకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భర్త మరణం తెలుసుకున్న భార్య లావణ్య కూడా తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆందోల్ లోని పెద్ద చెరువులో తన ఇద్దరు పిల్లల్ని పడేసి లావణ్య ఆత్మహత్య చేసుకుంది. మరణించిన పిల్లల్లో 8ఏళ్ల ప్రథమ్, మూడేళ్ల సర్వజ్ఞ ఉన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణాలకు పాల్పడటం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news