జైల్లో ల‌గ్జ‌రీ ఐటెమ్స్.. బోరున ఏడ్చేసిన సుకేశ్.. వీడియో వైరల్

-

మనీలాండరింగ్ కేసులో గత కొన్ని నెలలుగా జైల్లోనే ఖైదీగా ఉంటున్న సుకేశ్ చంద్రశేఖర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ గదిని పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి గదిలో లగ్జరీ వస్తువులను గుర్తించారు. అధికారులకు చిక్కగానే సుకేశ్ బోరున ఏడ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ దృశ్యాలు ఎలా లీక్ అయ్యాయన్న అంశంపై ప్రస్తుతం జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే సుకేశ్ గదిలో 1.5 ల‌క్ష‌ల విలువైన గుచ్చీ సాండ‌ల్‌, సుమారు 80 వేల ఖ‌రీదైన రెండు జ‌త‌ల జీన్ పాంట్ల‌ను అధికారులు గుర్తించారు. జైల‌ర్ దీప‌క్ శ‌ర్మ‌తో పాటు ఇత‌ర ఆఫీస‌ర్లు కాన్‌మాన్ సుకేశ్ గ‌దిలో తనిఖీకి వెళ్లారు. రూ200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నోరా ఫ‌తేహ్‌ల‌ను కూడా పోలీసులు ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news