సూళ్లూరుపేట ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్: MLC ఎన్నికలో వైసీపీ ఓటమికి… అదే కారణం !

-

ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల MLC ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి చెందడంతో పార్టీ నాయకులు ఆందోళనలో ఉన్నారు. అబ్బా…అదేంటి జగన్ అన్న ఉన్నా MLC ఎన్నికల్లో ఓడిపోవడం అంటూ అందరూ అంతర్మథనంలో పడ్డారు. కొందరు ఓటమికి కారణాలు బహిరంగంగా చెప్పినా… చాలా మంది మనసులోనే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

MLC ఎన్నికల్లో మా వైసీపీ నాయకులు మరియు అధిష్టానం అంతా కూడా ఖచ్చితంగా ఎంఎల్సి అభ్యర్థి గెలుస్తారు అని అతి విశ్వాసంతో ఉన్నారు.. ఇది ఒక్కటే మేము ఎంఎల్సి ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం అని సంజీవయ్య “మా నమ్మకం నువ్వే జగన్” అనే కార్యక్రమంలో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news