ఏపీలో మత మార్పిడి నిరోధ‌క చ‌ట్టం తీసుకొస్తాం : సునీల్ ధియోధర్

-

ఇవాళ ఏపీలో ప‌ర్య‌టించిన బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే…ఏపీలో మత మార్పిడి నిరోధ‌క చ‌ట్టం తీసుకొస్తామ‌ని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర‌ ప్రభుత్వానికి స్వంతంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసే సత్తా లేదా అని నిల‌దీశారు సునీల్ ధియోధర్. ఏపీలో సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ దాడులకు దిగుతోందని.. ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేయటం శోచనీయమ‌ని ఫైర్ అయ్యారు. ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని.. ఏపీలో పరిస్దితులు దారుణంగా ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది.. అభివృద్ది కార్యక్రమాలకు ఎక్కడా భూమి లభించడం లేదని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news